ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి పదవీకాలం పొడిగింపు
ABN , First Publish Date - 2022-01-29T09:00:46+05:30 IST
ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ పదవీకాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ పదవీకాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ను ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమించింది. 2021 నవంబరు 7తో ఆయన రెండేళ్ల పదవీకాలం పూర్తయింది. ఆ తేదీ నుంచి మరో ఏడాదిపాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ శుక్రవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు.