పోడు యాత్రకు సిద్ధమైన చాడ వెంకటరెడ్డి

ABN , First Publish Date - 2021-07-27T01:06:09+05:30 IST

పోడు యాత్రకు సిద్ధమైన చాడ వెంకటరెడ్డి

పోడు యాత్రకు సిద్ధమైన చాడ వెంకటరెడ్డి

హైదరాబాద్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పోడు యాత్రకు సిద్ధమైయారు. ఆగస్ట్ 4 నుంచి 8 వరకు కొమురంభీం జోడేఘాట్ నుంచి భద్రాచలం వరకు యాత్ర వుంటుందన్నారు. హరితహారం పేరుతో ప్రభుత్వం పోడుభూములను గుంజుకుంటోందని ఆయన ఆరోపించారు. పీడీ యాక్ట్ నిర్భందకాండ ద్వారా  రైతులను జైలు పాలు చేస్తున్నారని సీపీఐ ఆరోపించింది. అలాగే పోడు రైతులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. పోడు రైతులకు సైరం వడ్డీ లేని రుణాలను బేషరతుగా ఇప్పించాలని డిమాండ్ చేశారు. పోడు భూముల్లో హరితహారం రైతుల పాలిట ఉరిహారంగా మారుతోందని సీపీఐ ఆరోపించింది. పోడుయాత్ర వాల్ పోస్టర్‌ను సీపీఐ కార్యాలయంలో చాడా వెంకటరెడ్డి తదితరులు ఆవిష్కరించారు. 

Updated Date - 2021-07-27T01:06:09+05:30 IST