న్యాయమూర్తిపై పోస్టులు పెట్టిన వ్యక్తికి వారెంట్ జారీ

ABN , First Publish Date - 2021-07-26T17:54:10+05:30 IST

న్యాయమూర్తిపై పోస్టులు పెట్టిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి వారెంట్ జారీ చేశారు.

న్యాయమూర్తిపై పోస్టులు పెట్టిన వ్యక్తికి వారెంట్ జారీ

గుంటూరు: న్యాయమూర్తిపై పోస్టులు పెట్టిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి వారెంట్ జారీ చేశారు. నిందితుడు తొలి వాయిదాకే గైర్హాజరయ్యాడు. బెయిల్ షరతుల ఉల్లంఘనపై మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి అరెస్టు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. న్యాయవాదులు, తీర్పులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన తీరుపై న్యాయస్థానం సీరియస్ అయింది. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిపై కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు కడప జిల్లాకు చెందిన రాజశేఖర్ రెడ్డిని ఈ నెల 10న సీబీఐ పోలీసులు అరెస్టు చేసి గుంటూరులోని 4వ అదరపు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చగా అతనికి రిమాండ్ విధించింది. ఆ తర్వాత మూడు రోజులు సీబీఐ కస్టడీ కోరింది. విచారణ అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. నిన్న శుక్రవారం తొలి వాయిదాకు గైర్హాజరుకావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం మరోసారి వారెంట్ జారీ చేసింది. దీంతో సీబీఐ పోలీసులు అతనిని అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగారు.

Updated Date - 2021-07-26T17:54:10+05:30 IST