జానపద కళాకారులకు నగదు పురస్కారాలు

ABN , First Publish Date - 2020-10-24T09:04:05+05:30 IST

జానపద కళాకారులకు తనవంతు సహాయంగా సారిపల్లి కొండలరావు నగదు పురస్కారాలను ప్రదానం చేయడం అభినందనీయమని తెలంగాణ

జానపద కళాకారులకు నగదు పురస్కారాలు

రవీంద్రభారతి, అక్టోబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): జానపద కళాకారులకు తనవంతు సహాయంగా సారిపల్లి కొండలరావు నగదు పురస్కారాలను ప్రదానం చేయడం అభినందనీయమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కేవీ.రమణాచారి అన్నారు. శుక్రవారం రమణాచారి క్యాంప్‌ ఆఫీ్‌సలో సారిపల్లి కొండలరావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ జానపద కళల నగదు పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన పదిమంది కళాకారులకు రమణాచారి చేతుల మీదుగా నగదు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారిపల్లి కొండలరావు సేవాగుణానికి ఈ కార్యక్రమం నిదర్శణమని అన్నారు. ఎక్కడా లేని విధంగా ప్రతి నెలా జానపద కళాకారులను ఆదుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కళ పత్రిక సంపాదకుడు మహ్మద్‌ రఫీ, వైకే.నాగేశ్వరరావు, శ్రీనివా్‌సగౌడ్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-24T09:04:05+05:30 IST