పేలుడు ప్రమాద ఘటనలో ఐదుగురిపై కేసు
ABN , First Publish Date - 2021-05-10T15:15:29+05:30 IST
కడప : పేలుడు ప్రమాదంలో 10 మంది మృత్యువాత ఘటనలో.. క్వారీ యజమాని నాగేశ్వరెడ్డితో పాటు ఐదుగురిపై కేసు నమోదైంది.
కడప : పేలుడు ప్రమాదంలో 10 మంది మృత్యువాత ఘటనలో.. క్వారీ యజమాని నాగేశ్వరెడ్డితో పాటు ఐదుగురిపై కేసు నమోదైంది. పులివెందుల ప్రాంతం నుంచి తరలించిన పేలుడు బ్లాస్టింగ్ మందుల లైసెన్స్, ఇతర నిబంధనలపై పోలీసు అధికారులు విచారిస్తున్నారు. మైనింగ్లో మొత్తం నిబంధనలు ఉల్లంఘించినట్లు, క్వారీ యాజమాన్యం నిర్లక్షమే ప్రమాదానికి కారణమని అధికారులు తేల్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి కలెక్టర్ హరికిరణ్ నివేదిక పంపారు.