రైస్మిల్ యజమానులపై కేసు
ABN , First Publish Date - 2022-02-05T02:25:25+05:30 IST
రైస్మిల్ యజమానులపై అధికారులు కేసు నమోదు
మెదక్: రైస్మిల్ యజమానులపై అధికారులు కేసు నమోదు చేశారు. మాసాయిపేట శ్రీ చైతన్ పారాబాయిల్డ్ ఇండస్ట్రీని అధికారులు సీజ్ చేశారు. మిల్ యజమానులు వెంకటేష్, రమేష్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన రూ. 4 కోట్ల విలువైన 12 వేల క్వింటాళ్ల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు ఇవ్వాల్సి ఉంది. అయితే బియ్యాన్ని ఇవ్వకుండా, బియ్యాన్ని తాకట్టు పెట్టి రూ.3 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ ఘటనపై కలెక్టర్కు ఫిర్యాదులు అందాయి. దీంతో కలెక్టర్ రమేష్ చర్యలు తీసుకున్నారు.