పోలీసు కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథి

ABN , First Publish Date - 2021-08-24T23:16:57+05:30 IST

బ్యాంకులను మోసం చేసిన కేసులో అరెస్టయిన కార్వీ ఎండీ

పోలీసు కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథి

హైదరాబాద్‌: బ్యాంకులను మోసం చేసిన కేసులో అరెస్టయిన కార్వీ ఎండీ పార్థసారథిని పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. రెండు రోజుల పాటు సీసీఎస్ పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నెల 25, 26న సీసీఎస్ పోలీసులు విచారించనున్నారు. కస్టమర్ల షేర్లను కంపెనీ షేర్లుగా నమ్మించి వివిధ బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలను కార్వీ సంస్థ పొందింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో పార్థసారథి ఉన్నారు. రేపు చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి సీసీఎస్ పోలీసులు తీసుకోనున్నారు.  

Updated Date - 2021-08-24T23:16:57+05:30 IST