మదనపల్లెలో కోట్ల విలువ చేసే కార్లు సీజ్‌

ABN , First Publish Date - 2022-04-23T22:58:12+05:30 IST

జిల్లాలోని మదనపల్లెలో రూ. 5 కోట్ల విలువచేసే కార్లను పోలీసులు

మదనపల్లెలో కోట్ల విలువ చేసే కార్లు సీజ్‌

అన్నమయ్య: జిల్లాలోని మదనపల్లెలో రూ. 5 కోట్ల విలువచేసే కార్లను పోలీసులు సీజ్‌ చేశారు. అలాగే కార్లను ఎత్తుకెళుతున్న దొంగలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ నుంచి తొమ్మిది కార్లను తెచ్చి ఈ దొంగల ముఠా తనఖా పెట్టిందన్నారు. తిరిగి అవే కార్లను చోరీ చేసేందుకు ఈ ముఠా ప్రయత్నం చేసిందన్నారు. తమకు అందిన సమాచారంతో టూటౌన్‌ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో నలుగురు దొంగలను పట్టుకుని అరెస్ట్‌ చేశారు. వారి దగ్గరి నుంచి కార్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-04-23T22:58:12+05:30 IST