ఐసీసీ సిబ్బందికి కరోనా!
ABN , First Publish Date - 2020-09-28T10:53:36+05:30 IST
అంతర్జాతీ య క్రికెట్ మండలి (ఐసీ సీ) ప్రధాన కార్యాలయంలోని పలువురు ఉద్యోగులకు కరోనా సోకడంతో ఐపీఎల్ జట్లు ఆందోళన
ఐపీఎల్ జట్ల ఆందోళన
దుబాయ్: అంతర్జాతీ య క్రికెట్ మండలి (ఐసీ సీ) ప్రధాన కార్యాలయంలోని పలువురు ఉద్యోగులకు కరోనా సోకడంతో ఐపీఎల్ జట్లు ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే ఐపీఎల్లోని ఆరు జట్లు దుబాయ్ కేంద్రంగానే ఉంటున్నాయి. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఐసీసీ ప్రధాన కార్యాలయానికి దూరంగా అకాడమీ ఉందని, ప్రాక్టీస్ సెషన్స్ సమయంలోనూ ఐసీసీ సిబ్బంది ఎవరూ అక్కడ ఉండరని బోర్డు అధికారులు చెప్పారు. ఇక తమ సిబ్బందికి కరోనా సోకిన విషయాన్ని ఐసీసీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.