కరోనా భయం..
ABN , First Publish Date - 2020-07-11T08:38:38+05:30 IST
కరోనా నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు పత్రాలకు ఇస్త్రీ చేస్తున్నారు.
ఫిర్యాదు పత్రానికి ఇస్త్రీ
కోదాడ డీఎస్పీ కార్యాలయంలో ముందుజాగ్రత్త
కోదాడ, జూలై 10: కరోనా నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు పత్రాలకు ఇస్త్రీ చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద కరోనా వైరస్ చనిపోయే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్తగా ఈ చర్య చేపట్టినట్లు డీఎస్పీ రఘు మీడియాకు తెలిపారు.