తెలంగాణ పోలీస్ శాఖపై కరోనా పంజా
ABN , First Publish Date - 2022-01-18T22:21:45+05:30 IST
తెలంగాణ పోలీస్ శాఖపై కరోనా పంజా విసిరింది. ఇప్పటివరకు 800 మంది పోలీసులకు కరోనా నిర్ధారణ అయింది.
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖపై కరోనా పంజా విసిరింది. ఇప్పటివరకు 800 మంది పోలీసులకు కరోనా నిర్ధారణ అయింది. మంగళవారం నార్సింగి పీఎస్లో 20 మంది పోలీసులకు కరోనా వచ్చింది. కరోనా రావడంతో పీఎస్ బయటే నార్సింగి పోలీసులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అలాగే కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీస్లకు సాధారణ వ్యక్తుల అనుమతిని నిరాకరించారు. అత్యవసరమైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు వినియోగించుకుంటున్నారు. కరోనా కట్టడి చేసేందుకే పోలీసులు ఈ తరహా ఏర్పాట్లు చేశారు. ఇంటి దగ్గరకే పోలీస్ సేవలను అందిస్తున్నారు. ఫిర్యాదుదారులను పీఎస్లోకి కూడా అనుమతించడం లేదు. ఆన్లైన్ లేదా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తేనే స్వీకరిస్తామని పోలీసులు చెబుతున్నారు.