రాయుడు లేకే ఓడాం

ABN , First Publish Date - 2020-09-27T09:36:29+05:30 IST

అంబటి రాయుడు లేకపోవడంతో జట్టులో సమతూకం దెబ్బతింటోందని చెన్నై కెప్టెన్‌ ధోనీ తెలిపాడు. ఈ కారణంతోనే వరుసగా

రాయుడు లేకే ఓడాం

దుబాయ్‌: అంబటి రాయుడు లేకపోవడంతో జట్టులో సమతూకం దెబ్బతింటోందని చెన్నై  కెప్టెన్‌ ధోనీ తెలిపాడు. ఈ కారణంతోనే వరుసగా రెండు ఓటములు ఎదురయ్యాయని వివరించాడు. శుక్రవారం ఢిల్లీతో మ్యాచ్‌లో సీఎ్‌సకే చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఆరంభ మ్యాచ్‌లో ఆడిన రాయుడు ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. ‘రాయుడు లేకపోవడంతో చివరి రెండు మ్యాచ్‌లను ఓడాం. జట్టు కూర్పు కూడా కుదరడం లేదు. వచ్చే మ్యాచ్‌లోనైనా రాయుడు అందుబాటులోకి వస్తే సమతూకం వస్తుంది. అలాగే ఎక్స్‌ట్రా బౌలర్‌తో ప్రయోగాలు చేసే వీలుంటుంది’ అని ధోనీ చెప్పాడు.


Updated Date - 2020-09-27T09:36:29+05:30 IST