ఈ రోడ్లపై రిస్క్‌ చేయలేం!

ABN , First Publish Date - 2020-12-05T10:19:58+05:30 IST

శాసనసభ శీతాకాల సమావేశాలు ముగిశాయి. సమావేశాలు ముగియగానే శాసనసభ్యులు సాధారణంగా ప్రయాణ ఉత్సాహం చూపుతుంటారు.

ఈ రోడ్లపై రిస్క్‌ చేయలేం!

రాత్రి అసలే ప్రయాణించలేం

సభలు ముగిసినా తిరిగెళ్లకుండా

అద్దె బసలోనే పలువురు ఎమ్మెల్యేలు


అమరావతి, డిసెంబరు4 (ఆంధ్రజ్యోతి): శాసనసభ శీతాకాల సమావేశాలు ముగిశాయి. సమావేశాలు ముగియగానే శాసనసభ్యులు సాధారణంగా ప్రయాణ ఉత్సాహం చూపుతుంటారు. ఐదురోజులుగా ఇంటికి, నియోజకవర్గానికి దూరమైనవారు..ఎప్పుడెప్పుడు తిరిగి వెళదామా అని ఆత్రుత పడుతుంటారు. కానీ, శుక్రవారం సమావేశాలు ము గించుకొని బయటకు వచ్చిన పలువురు శాసనసభ్యుల్లో అటువంటి హడావుడే కనిపించలేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలయితే.. ‘ఏం తొందరలే..’ అన్నట్టు రాత్రికి విజయవాడలోనే బస చేయాలని కూడా నిర్ణయించుకొన్నారట! కారణం, రాష్ట్రంలో భయపెట్టేలా తయారయిన రహదారుల దుస్థితి! అలాంటి రోడ్లపై ప్రయాణం ఒక నరకం. అందులోనూ రాత్రివేళలో వెళ్లడం అంటే ఇంకేమైనా ఉందా! దీంతో ఈ సభల కోసం వచ్చి బసచేసిన ఫ్లాట్లు, హోటళ్లకు వారంతా చేరిపోయారు. శనివారం ఉదయం తమ ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకొన్నారు. 

Updated Date - 2020-12-05T10:19:58+05:30 IST