తల్లిపై చేయిచేసుకున్న కొడుకు.. కారణం తెలిస్తే షాకవుతారు!
ABN , First Publish Date - 2020-04-10T21:37:56+05:30 IST
టాయిలెట్ పేపర్లను దాచిందనే కారణంతో తల్లిపై కొడుకు దాడి చేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాకు చెందిన అడ్రియన్ యాన్(26)కు టాయిలెట్ పేపర్లను విపరీతంగా ఉపయోగించే అలవాటు ఉంది. అయితే క
లాస్ ఏంజిల్స్: టాయిలెట్ పేపర్లను దాచిందనే కారణంతో తల్లిపై కొడుకు దాడి చేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాకు చెందిన అడ్రియన్ యాన్(26)కు టాయిలెట్ పేపర్లను విపరీతంగా ఉపయోగించే అలవాటు ఉంది. అయితే కరోనా వైరస్ అమెరికాను అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ అమలవుతోంది. ప్రపంచంలోని చాలా దేశాలు లాక్డౌన్ విధించాయి. ఈ నేపథ్యంలో టాయిలెట్ పేపర్లకు కొరత రావొచ్చనే ఉద్దేశంతో అడ్రియన్ యాన్ తల్లి.. అవసరానికి సరిపడా టాయిలెట్ పేపర్లను ఉంచి, మిగిలిన వాటిని దాచింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అడ్రియన్ యాన్.. తన తల్లిపై దాడికి దిగాడు. అయితే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని అడ్రియన్ యాన్ను అరెస్టు చేశారు. కాగా.. వరల్డ్ఒమీటర్.ఇన్ఫోలోని సమాచారం ప్రకారం కరోనా కాటుకు ఇప్పటి వరకు అమెరికాలో దాదాపు 17వేల మంది మరణించారు. కాలిఫోర్నియాలో 20,212 మందికి వైరస్ సోకగా.. 559 మంది మహమ్మారికి బలయ్యారు.