చైనా యాప్ల కేసులో సీఏ రవికుమార్ అరెస్టు
ABN , First Publish Date - 2021-12-04T07:45:14+05:30 IST
చైనా యాప్ల సాయంతో జరిగిన ఆర్థిక అవకతవకల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఢిల్లీకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్ను శుక్రవారం అరెస్టు చేశారు.
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): చైనా యాప్ల సాయంతో జరిగిన ఆర్థిక అవకతవకల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఢిల్లీకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్ను శుక్రవారం అరెస్టు చేశారు. ఫోర్జరీ బిల్లులతో రూ.1,100 కోట్లు చైనాకు తరలించారని, బోగస్ బిల్లుల జారీలో సీఏ రవికుమార్ పాత్ర కీలకంగా ఉందని ఈడీ గుర్తించింది.