టిక్‌టాక్ సంచలన నిర్ణయం! నిషేధం కొనసాగుతున్నా కూడా..

ABN , First Publish Date - 2020-07-11T16:58:58+05:30 IST

భారత ప్రభుత్వం టిక్‌టాక్‌ను నిషేధించింది. ఈ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశాలు కూడా కనుచూపు మేరలో లేవు. అయినప్పటికీ టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ మాత్రం భారత్ విషయంలో తన ప్రణాళికలను యథాతథంగా అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

టిక్‌టాక్ సంచలన నిర్ణయం! నిషేధం కొనసాగుతున్నా కూడా..

ముంబై: భారత ప్రభుత్వం టిక్‌టాక్‌ను నిషేధించింది. ఈ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశాలు కూడా కనుచూపు మేరలో లేవు. అయినప్పటికీ టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ మాత్రం భారత్ విషయంలో తన ప్రణాళికలను యథాతథంగా అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముంబైలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించేందుకు  బైట్‌డ్యాన్స్ సిద్ధమైందని సమాచారం. ఇందుకోసం వీవర్క్ అనే సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుందనే వార్త వైరల్ అవుతోంది. చైనా సంస్థగా టిక్‌టాక్‌కు ఉన్న పేరు అప్రతిష్ట తెస్తున్న కారణంగా బైట్‌డ్యాన్స్  చైనాకు దూరం జరిగేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యూహంలో భాగంగానే.. భారత్‌లో నిషేధం కొనసాగుతున్నప్పటికీ కూడా ముంబైలో కొత్త కార్యాలయం ప్రారంభించేందుకు బైట్‌డ్యాన్స్ రెడీ అయిందని వినికిడి. ఈ ప్రయత్నాల ద్వారా భారత్‌లో తాను కోల్పోయిన ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు విశ్వప్రయత్నం చేస్తోందని సమాచారం. 

Updated Date - 2020-07-11T16:58:58+05:30 IST