బత్తాయి రైతులను ఆదుకోవాలి: డీకే అరుణ

ABN , First Publish Date - 2020-04-10T07:27:35+05:30 IST

పౌరసరఫరాల శాఖ ద్వారా బత్తాయిలను కొనుగోలు చేయాలని బీజేపీ నేత డీకే అరుణ కోరారు. నాగ్‌పూర్‌ మార్కెట్‌లో ఉన్న రేటు ప్రకారం కొనుగోలు చేస్తే రైతులకు...

బత్తాయి రైతులను ఆదుకోవాలి: డీకే అరుణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): పౌరసరఫరాల శాఖ ద్వారా బత్తాయిలను కొనుగోలు చేయాలని బీజేపీ నేత డీకే అరుణ కోరారు. నాగ్‌పూర్‌ మార్కెట్‌లో ఉన్న రేటు ప్రకారం కొనుగోలు చేస్తే రైతులకు కొంతమేరకైనా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయని పక్షంలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బత్తాయితో పాటు నిమ్మరైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఒక ప్రకటనలో కోరారు. 

Updated Date - 2020-04-10T07:27:35+05:30 IST