రాష్ట్రంలో మీడియా హక్కులను హరిస్తున్నారు: బుచ్చయ్య చౌదరి

ABN , First Publish Date - 2022-03-07T19:36:43+05:30 IST

రాష్ట్రంలో మీడియా హక్కులను ప్రభుత్వం హరిస్తోందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

రాష్ట్రంలో మీడియా హక్కులను హరిస్తున్నారు: బుచ్చయ్య చౌదరి

అమరావతి: రాష్ట్రంలో మీడియా హక్కులను ప్రభుత్వం హరిస్తోందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబీలోకి నెట్టిందని ఆరోపించారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రశ్నించాల్సిన గవర్నర్‌ స్పందించడం లేదని, అందుకే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నామని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.


కాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ టీడీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. ప్రసంగ ప్రతులను చించివేసి గాల్లోకి విసిరారు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేయబోయారు. అయితే.. గవర్నర్ తిరిగి వెళ్లే దారిలో టీడీపీ ప్రజాప్రతినిధులు వెళ్లనీయకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. మండలికి కూడా వెళ్లకుండా అడ్డుకుంటారా..? అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మండిపడ్డారు. సభలో మాట్లాడనివ్వడం లేదని.. కనీసం లాబీల్లో కూడా ఉండనివ్వరా అంటూ కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-03-07T19:36:43+05:30 IST