ఆ విషయంలో కేసీఆర్‌ను వదిలే ప్రసక్తేలేదు: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-01-18T23:22:45+05:30 IST

317జీవోను సవరించేవరకు సీఎం కేసీఆర్‌ను వదిలే ప్రసక్తేలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

ఆ విషయంలో కేసీఆర్‌ను వదిలే ప్రసక్తేలేదు: బండి సంజయ్

హైదరాబాద్: 317జీవోను సవరించేవరకు సీఎం కేసీఆర్‌ను వదిలే ప్రసక్తేలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులు తలుచుకుంటే ఏమైందో కేసీఆర్ గుర్తుచేసుకోవాలని హెచ్చరించారు.బీజేపీ జాతీయ నేతలతో ఉద్యోగ, ఉపాధ్యాయుల వర్చువల్ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు.2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. కేసీఆర్ జాతకం బాగాలేదని చెప్పారు.కార్పొరేట్ పాఠశాల నుంచి డబ్బులు దండుకోవటం కోసమే ఇంగ్లిషు మీడియం అంటున్నారన్నారు.ప్రధాని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశానికి ఎందుకు హాజరుకాలేదో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. బీజేపీ అండగా ఉంటోందని భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ కొత్త డ్రామాలు మొదలుపెట్టాడన్నారు. ప్రభుత్వం ఒత్తిడితోనే ఉపాధ్యాయ ఉద్యోగులు విధుల్లో చేరుతున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి ఇస్తామని ఇతర రాష్ట్రాలు హామీ ఇవ్వలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-01-18T23:22:45+05:30 IST