‘పందెం కోళ్లకు’ బహుమతిగా బుల్లెట్ బండ్లు

ABN , First Publish Date - 2022-01-18T01:28:53+05:30 IST

వారిద్దరూ కాసిన ప్రతీ పందెంలోనూ గెలిచి.. అత్యధిక కోడి పందేలు గెలిచిన విజేతలుగా నిలిచారు. కనీవినీ ఎరుగనంత మొత్తాన్ని సొంతం చేసుకున్నారు.

‘పందెం కోళ్లకు’ బహుమతిగా బుల్లెట్ బండ్లు

జంగారెడ్డిగూడెం: వారిద్దరూ కాసిన ప్రతీ పందెంలోనూ గెలిచి.. అత్యధిక కోడి పందేలు గెలిచిన విజేతలుగా నిలిచారు. కనీవినీ ఎరుగనంత మొత్తాన్ని సొంతం చేసుకున్నారు. దీనికి గుర్తుగా పందెం బరి నిర్వాహకులు రెండు బుల్లెట్లను వారికి బహూకరించి మరింత ఆనందాన్ని నింపారు. పశ్చిమ గోదావరి జిల్లా సీసలిలో మూడు రోజులుగా కోడి పందేలు నిర్వహించారు. రెండు కేటగిరీలుగా చిన్న పందేలు, పెద్ద పందేలుగా విభజించారు. వీటిల్లో అత్యధికంగా గెలుచుకున్న కృష్ణా జిల్లా కలిదిండి, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ఇద్దరు ముందు వరుసలో నిలిచారు. ఆదివారం రాత్రి ప్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహించిన కోడి పందేల్లో.. వీరిద్దరికీ స్థానిక ఎమ్మెల్యే మంతెన రామరాజు(టీడీపీ), ఆయన సోదరుడు మంతెన పెద్ద నరసింహరాజు చేతుల మీదుగా రెండు బుల్లెట్లను అందజేశారు. వీరిద్దరూ ఎమ్మెల్యే సోదరులను బైక్‌లపై ఎక్కించుకుని బరిలో రౌండ్లు వేస్తూ హల్‌చల్‌ చేశారు. వీరిద్దరు గెలిచిన పందేలను పెద్ద ఎత్తున చెప్పుకుంటున్నారు. 

Updated Date - 2022-01-18T01:28:53+05:30 IST