జగన్ ఏది చెబితే అది చేయడం డీజీపీ విధి: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2021-07-26T17:47:48+05:30 IST

సీఎం జగన్ ఏది చెబితే అది చేయడం డీజీపీ విధిగా మారిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు. డీజీపీపై ఇంటిలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయని పోలీసులు అనుకుంటున్నారన్నారు.

జగన్ ఏది చెబితే అది చేయడం డీజీపీ విధి: బుద్దా వెంకన్న

అమరావతి: సీఎం జగన్ ఏది చెబితే అది చేయడం డీజీపీ విధిగా మారిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు. డీజీపీపై ఇంటిలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయని పోలీసులు అనుకుంటున్నారన్నారు. జగన్ మెప్పు కోసం టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. డీజీపీగా కంటే జగన్ వ్యక్తిగత సహాయకుడిగానే సవాంగ్ పనిచేశారన్నారు. వ్యవస్థలన్నీ సీఎంఓ ఆదేశాలకు లోబడి పనిచేస్తున్నాయని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-26T17:47:48+05:30 IST