రాధాని చంపేందుకు రెక్కీ నిర్వహించడం దారుణం: బుద్దా వెంకన్న
ABN , First Publish Date - 2021-12-29T19:05:32+05:30 IST
వైసీపీ పాలన చూస్తుంటే విజయవాడకు మళ్లీ పాత రోజులు వస్తాయనే ఆందోళన కలుగుతుందని టీడీపీ ఎమ్మెల్యీ బుద్దా వెంకన్న అన్నారు.
విజయవాడ: వైసీపీ పాలన చూస్తుంటే విజయవాడకు మళ్లీ పాత రోజులు వస్తాయనే ఆందోళన కలుగుతుందని టీడీపీ ఎమ్మెల్యీ బుద్దా వెంకన్న అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైసీపీ అరాచక పాలనలో అడ్డగోలుగా దాడులకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ దాడికి యత్నించారన్నారు. టీడీపీ కార్యాలయం, పట్టాభి నివాసంపై దాడులు అదే రోజు వంగవీటి రాధాకృష్ణని చంపేందుకు రెక్కీ నిర్వహించడం దారుణమన్నారు. ఈ పరిణామాలు చూస్తే పాత బెజవాడ గుర్తొస్తుందన్నారు. రాధా ఎవరి జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటున్నారని చెప్పారు.
తండ్రి ఆశయాల సాధన కోసం రాధా కృషి చేస్తున్నారన్నారు. సైలెంట్ గా ఉండే రాధాకృష్ణపై ఎవరు రెక్కీ నిర్వహించారో అందరకీ తెలుసునని చెప్పారు. టీడీపీ ఆఫీస్పై దాడికి, ఈ రెక్కీకి లింక్ ఉందన్నారు. వైఎస్ బిడ్డగా జగన్కు ఎంత పేరు ఉందో.. రంగా బిడ్డగా రాధాకృష్ణ అంతకంటే రెట్టింపు పేరు ఉందని చెప్పారు. ఈ కుట్రలో విజయవాడ నేతలతో పాటు, వైసీపీ పెద్దల ప్రమేయం కూడా ఉందన్నారు. దోషులను పట్టుకునేందుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్తో విచారణ చేయించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.