తెలుగులో బీటెక్ చేసి ఎక్కడ పకోడీలు అమ్ముకోవాలి?

ABN , First Publish Date - 2021-08-05T07:55:40+05:30 IST

జాతీయ విద్యా విధానం 2020 అమల్లోకి వచ్చి ఇటీవల ఏడాది పూర్తయింది. ఈ విధానంలో భాగంగా ప్రధాని ప్రారంభించిన విద్యా కార్యక్రమాల్లో భాషకు...

తెలుగులో బీటెక్ చేసి ఎక్కడ పకోడీలు అమ్ముకోవాలి?

జాతీయ విద్యా విధానం 2020 అమల్లోకి వచ్చి ఇటీవల ఏడాది పూర్తయింది. ఈ విధానంలో భాగంగా ప్రధాని ప్రారంభించిన విద్యా కార్యక్రమాల్లో భాషకు సంబంధిన రెండు విషయాలు విస్తుగొలుపుతున్నాయి. జులై 29న ప్రధాని తన ప్రసంగంలో ‘జాతిపిత దూరదృష్టితో చేసిన ఆలోచనను నెరవేర్చేందుకే మాతృభాషలో విద్యాబోధన అంశాన్ని నూతన విద్యా విధానంలో చేర్చాం’ అన్నారు. ఇప్పటిదాకా విద్యా బోధన మాతృభాషలో లేదని ప్రధానమంత్రి అభిప్రాయమా? ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషలోనే బోధన జరుగుతుందనే విషయం ఆయనకు తెలియదా? లేక ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండే ప్రైవేటు కార్పోరేట్ పాఠశాలల గురించి చెప్పినట్లు అనుకోవాలా? ఒకవేళ అదే అనుకున్నా ప్రైవేటు స్కూళ్ళు ఈ విధానాన్ని ఖాతరు చేయవనే విషయం అందరికీ తెలిసిందే. ‘మాతృభాషలో విద్యా బోధన వల్ల దేశంలోని పేద, మధ్యతరగతి, గ్రామీణ, దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది’ అని ప్రధాని అనడం మరీ వింతగా వుంది. ఇప్పుడు మాతృభాష మాధ్యమం గల పాఠశాలల్లో పిల్లల్ని చదివిస్తూ నష్టపోతున్నామని బాధపడుతున్నది ఈ వర్గాల ప్రజలే. సంపన్నులు, అగ్రకులాలు, పట్టణాల్లోని విద్యార్థులు దర్జాగా ప్రైవేటు ఇంగ్లీషు మీడియమ్ స్కూళ్లలో చదువుతున్నారు. ఈనాటి మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ఇంగ్లీషులో నైపుణ్యాలు ఉన్నవారికే ఉద్యోగాలు వస్తున్నాయనే విషయమూ తెలిసిందే. అందుకు విరుద్ధంగా యువత భవిష్యత్తు కోసమే ప్రాంతీయ భాషల్లో విద్యా బోధన చేయబోతున్నట్లు చెప్పడం అసంబద్ధంగా ఉన్నది. ఒకపక్క ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, సంపన్నులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల పిల్లలు అందరూ ఇంగ్లీషు మీడియంలోనే చదువుతుండగా బడుగు బలహీన వర్గాల ఉద్ధరణకే మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పడం సమంజసంగా లేదు. 


ఇక, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిపెడుతున్న అనవసర పథకాల్లో ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య ఒకటి. ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కళాశాలలు హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బంగ్లా మాధ్యమాల్లో బోధనను ప్రారంభించడం తనకెంతో ఆనందం కలిగించినట్లు మోదీ మురిసిపోవడం ఎవరికీ నచ్చలేదు. ఆ ప్రకటన చేసిన జూలై 29 సాయంత్రం నాటికి ట్విట్టర్‍లో వచ్చిన లైకులు 709, రీట్వీటులు 298 మాత్రమే. ఇంజనీరింగ్ విద్య ప్రాంతీయ భాషల్లో కావాలని ఎవరు అడిగారు? ఆ కాలేజీల్లో పని చేసే ఫ్యాకల్టీ కూడా ప్రధాని ప్రకటనను స్వాగతించలేదు. ఈ చర్యతో దేశ విద్యారంగంలో కొంత ప్రాచుర్యంలో వున్న ఇంజనీరింగ్ విద్య కూడా దెబ్బతినే పరిస్థితి కనపడుతోంది. బీటెక్ చేసిన వారిలో కూడా ఉద్యోగాలు పొందేవారి సంఖ్య ఏయేటికాయేడు తగ్గిపోతోంది. భారతదేశంలో ప్రతి ఏటా 15లక్షల మంది ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేస్తున్నా వారిలో 20శాతం మంది మాత్రమే ఇంజనీరు ఉద్యోగాలకు అర్హత సాధించగలుగుతున్నారని ‘ఎంప్లాయబిలిటీ సర్వే 2019’ పేర్కొన్నది. ఉదారవాద సంస్కరణలతో అవసరానికి మించి ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పడం, నాణ్యమైన టీచింగ్ ఫ్యాకల్టీ లేకపోవడం, కరిక్యులం అప్డేట్ కాకపోవడంతో పాటు విద్యార్థులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం, కమ్యూనికేటివ్ స్కిల్స్ లేకపోవడాన్ని ఈ సర్వే ముఖ్యమైన లోపాలుగా గుర్తించింది. కార్పోరేట్ సంస్థల్లోను, మల్టీ నేషనల్ కంపెనీల్లోను, విదేశాల్లోను ఉద్యోగాలకు అవసరమైన ఐటీ, కంప్యూటర్ సబ్జెక్టుల్లో బీటెక్ చేసిన వారికి కూడా ఇంగ్లీష్ మీద పట్టులేకపోవడం పెద్ద లోపంగా ఉంది. సాంకేతిక విద్యలో కొత్తగా ప్రవేశిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ మున్నగువాటికి ఇంగ్లీష్ పరిజ్ఞానం అనివార్యం. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళం తదితర ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సులు చదివిన యువకులు ఏమి చేయాలి? ఎక్కడ పకోడీలు అమ్ముకుని బతకాలి? తమిళనాడులో పదేళ్ల క్రితం నుండే తమిళ మీడియంలో ఇంజనీరింగ్ విద్య అమల్లో వుంది. కానీ రెండు శాతం మంది కూడా ఆ కోర్సు తీసుకోవడం లేదు. మాతృభాషలో ఇంజనీరింగ్ చదివితే ఉద్యోగాలు రావనే విషయం తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలుసు. ఆ విషయం కేంద్రప్రభుత్వానికి తెలియదా? ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సులు చేసినవారికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందనే భరోసా కూడా ప్రధాని చెప్పలేదు. అరవై ఏళ్లుగా అపసవ్య విధానాలతో అల్లాడుతున్న భారత విద్యా వ్యవస్థలో ఎందుకీ అనవసర ప్రయోగాలు?


భారతీయ సంస్కృతికి పట్టం కట్టాలనే పేరుతో విద్యారంగంలో భారతీయ భాషలకు పెద్ద పీట వేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలనడం వరకూ అర్థం చేసుకోవచ్చు. దానిని కూడా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు ఆదరించడం లేదనుకోండి. ఇక ఉన్నత సాంకేతిక విద్యలు మాతృభాషల్లో/ప్రాంతీయ భాషల్లో నేర్పాలనేది పాలకుల స్వీయ మానసిక ధోరణి తప్ప ఆచరణయోగ్యమైంది కాదు. ఒకవేళ అమలైతే ఈ ప్రాజెక్ట్ కూడా ఫీజు రీయింబర్సుమెంటు పథకం ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ కళాశాలల కంటే ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకే ఎక్కువగా ఉపయోగపడే అవకాశం వుంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఈ విద్యా సంవత్సరం నుంచే అనుమతించినందున ఇప్పటికే కొన్ని కార్పొరేట్ కాలేజీలు తెలుగు మీడియంలో సివిల్, మెకానికల్ వంటి ఐదు బీటెక్ కోర్సులను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కోర్సులకు ఇప్పటిదాకా ఎవరూ దరఖాస్తు చేసుకోకున్నా ఇంగ్లీషు మీడియంలో సీట్లు లభించని వారిలో ఏదోవిధంగా ఇంజనీర్ కావాలనుకునేవారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రాంతీయ భాషల్లో పుస్తకాలు రాలేదు, శిక్షణ పొందిన అధ్యాపకులు లేరు. అయినా ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ విద్య ప్రారంభమైనట్లు చెప్పడంలోనే కేంద్రప్రభుత్వ అత్యుత్సాహం వ్యక్తమవుతోంది.


తీయ విద్యా విధానం 2020 అమల్లోకి వచ్చి ఇటీవల ఏడాది పూర్తయింది. ఈ విధానంలో భాగంగా ప్రధాని ప్రారంభించిన విద్యా కార్యక్రమాల్లో భాషకు సంబంధిన రెండు విషయాలు విస్తుగొలుపుతున్నాయి. జులై 29న ప్రధాని తన ప్రసంగంలో ‘జాతిపిత దూరదృష్టితో చేసిన ఆలోచనను నెరవేర్చేందుకే మాతృభాషలో విద్యాబోధన అంశాన్ని నూతన విద్యా విధానంలో చేర్చాం’ అన్నారు. ఇప్పటిదాకా విద్యా బోధన మాతృభాషలో లేదని ప్రధానమంత్రి అభిప్రాయమా? ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషలోనే బోధన జరుగుతుందనే విషయం ఆయనకు తెలియదా? లేక ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండే ప్రైవేటు కార్పోరేట్ పాఠశాలల గురించి చెప్పినట్లు అనుకోవాలా? ఒకవేళ అదే అనుకున్నా ప్రైవేటు స్కూళ్ళు ఈ విధానాన్ని ఖాతరు చేయవనే విషయం అందరికీ తెలిసిందే. ‘మాతృభాషలో విద్యా బోధన వల్ల దేశంలోని పేద, మధ్యతరగతి, గ్రామీణ, దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది’ అని ప్రధాని అనడం మరీ వింతగా వుంది. ఇప్పుడు మాతృభాష మాధ్యమం గల పాఠశాలల్లో పిల్లల్ని చదివిస్తూ నష్టపోతున్నామని బాధపడుతున్నది ఈ వర్గాల ప్రజలే. సంపన్నులు, అగ్రకులాలు, పట్టణాల్లోని విద్యార్థులు దర్జాగా ప్రైవేటు ఇంగ్లీషు మీడియమ్ స్కూళ్లలో చదువుతున్నారు. ఈనాటి మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ఇంగ్లీషులో నైపుణ్యాలు ఉన్నవారికే ఉద్యోగాలు వస్తున్నాయనే విషయమూ తెలిసిందే. అందుకు విరుద్ధంగా యువత భవిష్యత్తు కోసమే ప్రాంతీయ భాషల్లో విద్యా బోధన చేయబోతున్నట్లు చెప్పడం అసంబద్ధంగా ఉన్నది. ఒకపక్క ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, సంపన్నులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల పిల్లలు అందరూ ఇంగ్లీషు మీడియంలోనే చదువుతుండగా బడుగు బలహీన వర్గాల ఉద్ధరణకే మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పడం సమంజసంగా లేదు. 


ఇక, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిపెడుతున్న అనవసర పథకాల్లో ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య ఒకటి. ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కళాశాలలు హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బంగ్లా మాధ్యమాల్లో బోధనను ప్రారంభించడం తనకెంతో ఆనందం కలిగించినట్లు మోదీ మురిసిపోవడం ఎవరికీ నచ్చలేదు. ఆ ప్రకటన చేసిన జూలై 29 సాయంత్రం నాటికి ట్విట్టర్‍లో వచ్చిన లైకులు 709, రీట్వీటులు 298 మాత్రమే. ఇంజనీరింగ్ విద్య ప్రాంతీయ భాషల్లో కావాలని ఎవరు అడిగారు? ఆ కాలేజీల్లో పని చేసే ఫ్యాకల్టీ కూడా ప్రధాని ప్రకటనను స్వాగతించలేదు. ఈ చర్యతో దేశ విద్యారంగంలో కొంత ప్రాచుర్యంలో వున్న ఇంజనీరింగ్ విద్య కూడా దెబ్బతినే పరిస్థితి కనపడుతోంది. బీటెక్ చేసిన వారిలో కూడా ఉద్యోగాలు పొందేవారి సంఖ్య ఏయేటికాయేడు తగ్గిపోతోంది. భారతదేశంలో ప్రతి ఏటా 15లక్షల మంది ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేస్తున్నా వారిలో 20శాతం మంది మాత్రమే ఇంజనీరు ఉద్యోగాలకు అర్హత సాధించగలుగుతున్నారని ‘ఎంప్లాయబిలిటీ సర్వే 2019’ పేర్కొన్నది. ఉదారవాద సంస్కరణలతో అవసరానికి మించి ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పడం, నాణ్యమైన టీచింగ్ ఫ్యాకల్టీ లేకపోవడం, కరిక్యులం అప్డేట్ కాకపోవడంతో పాటు విద్యార్థులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం, కమ్యూనికేటివ్ స్కిల్స్ లేకపోవడాన్ని ఈ సర్వే ముఖ్యమైన లోపాలుగా గుర్తించింది. కార్పోరేట్ సంస్థల్లోను, మల్టీ నేషనల్ కంపెనీల్లోను, విదేశాల్లోను ఉద్యోగాలకు అవసరమైన ఐటీ, కంప్యూటర్ సబ్జెక్టుల్లో బీటెక్ చేసిన వారికి కూడా ఇంగ్లీష్ మీద పట్టులేకపోవడం పెద్ద లోపంగా ఉంది. సాంకేతిక విద్యలో కొత్తగా ప్రవేశిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ మున్నగువాటికి ఇంగ్లీష్ పరిజ్ఞానం అనివార్యం. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళం తదితర ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సులు చదివిన యువకులు ఏమి చేయాలి? ఎక్కడ పకోడీలు అమ్ముకుని బతకాలి? తమిళనాడులో పదేళ్ల క్రితం నుండే తమిళ మీడియంలో ఇంజనీరింగ్ విద్య అమల్లో వుంది. కానీ రెండు శాతం మంది కూడా ఆ కోర్సు తీసుకోవడం లేదు. మాతృభాషలో ఇంజనీరింగ్ చదివితే ఉద్యోగాలు రావనే విషయం తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలుసు. ఆ విషయం కేంద్రప్రభుత్వానికి తెలియదా? ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సులు చేసినవారికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందనే భరోసా కూడా ప్రధాని చెప్పలేదు. అరవై ఏళ్లుగా అపసవ్య విధానాలతో అల్లాడుతున్న భారత విద్యా వ్యవస్థలో ఎందుకీ అనవసర ప్రయోగాలు?


భారతీయ సంస్కృతికి పట్టం కట్టాలనే పేరుతో విద్యారంగంలో భారతీయ భాషలకు పెద్ద పీట వేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలనడం వరకూ అర్థం చేసుకోవచ్చు. దానిని కూడా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు ఆదరించడం లేదనుకోండి. ఇక ఉన్నత సాంకేతిక విద్యలు మాతృభాషల్లో/ప్రాంతీయ భాషల్లో నేర్పాలనేది పాలకుల స్వీయ మానసిక ధోరణి తప్ప ఆచరణయోగ్యమైంది కాదు. ఒకవేళ అమలైతే ఈ ప్రాజెక్ట్ కూడా ఫీజు రీయింబర్సుమెంటు పథకం ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ కళాశాలల కంటే ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకే ఎక్కువగా ఉపయోగపడే అవకాశం వుంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఈ విద్యా సంవత్సరం నుంచే అనుమతించినందున ఇప్పటికే కొన్ని కార్పొరేట్ కాలేజీలు తెలుగు మీడియంలో సివిల్, మెకానికల్ వంటి ఐదు బీటెక్ కోర్సులను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కోర్సులకు ఇప్పటిదాకా ఎవరూ దరఖాస్తు చేసుకోకున్నా ఇంగ్లీషు మీడియంలో సీట్లు లభించని వారిలో ఏదోవిధంగా ఇంజనీర్ కావాలనుకునేవారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రాంతీయ భాషల్లో పుస్తకాలు రాలేదు, శిక్షణ పొందిన అధ్యాపకులు లేరు. అయినా ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ విద్య ప్రారంభమైనట్లు చెప్పడంలోనే కేంద్రప్రభుత్వ అత్యుత్సాహం వ్యక్తమవుతోంది.

నాగటి నారాయణ

Updated Date - 2021-08-05T07:55:40+05:30 IST