రైతులకు భూములు తిరిగి ఇచ్చేయాలి: బీఎస్పీ నేత
ABN , First Publish Date - 2021-12-05T23:33:10+05:30 IST
జిల్లాలోని సదాశివనగర్ మండలం లింగంపల్లి శివారులో జ్యూట్ పరిశ్రమ భూనిర్వాసిత రైతుల దీక్షకు బీఎస్పీ నేత ప్రవీణ్కుమార్ సంఘీభావం తెలిపారు.
కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలం లింగంపల్లి శివారులో జ్యూట్ పరిశ్రమ భూనిర్వాసిత రైతుల దీక్షకు బీఎస్పీ నేత ప్రవీణ్కుమార్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు భూములు తిరిగి ఇచ్చేయాలన్నారు. పంట చేతికి వచ్చే సమయంలో భూములను లాక్కుంటున్నారని బీఎస్పీ నేత ప్రవీణ్కుమార్ మండిపడ్డారు.