మచిలీపట్నం మాచవరంలో దారుణం.. ఓ వ్యక్తిపై కత్తితో దాడి

ABN , First Publish Date - 2020-07-05T00:11:16+05:30 IST

మచిలీపట్నం మాచవరంలో దారుణం.. ఓ వ్యక్తిపై కత్తితో దాడి

మచిలీపట్నం మాచవరంలో దారుణం.. ఓ వ్యక్తిపై కత్తితో దాడి

కృష్ణా: మచిలీపట్నం మాచవరంలో దారుణం చోటు చేసుకుంది. మాచవరంలో ఓ వ్యక్తిపై కొందరు వ్యక్తులు హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారు. కారు ఫైనాన్స్‌ డబ్బు అడిగేందుకు వెళ్లిన వరుణ్‌ మారుతి ఉద్యోగి రాజేష్‌పై కత్తితో దాడి చేశారు. చిలకలపూడికి చెందిన జ్యువెల్లరీషాపు యజమాని నాగేశ్వరరావు, అతని కుమారుడు హత్యాయత్నం చేసినట్లు నిర్థారణ అయింది. కత్తితో పొడిచి పక్కనే ఉన్న కాలువలో పడేసి నిందితులు వెళ్లారు. గాయపడిన రాజేష్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. హత్యాయత్నం చేసిన తండ్రికొడుకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2020-07-05T00:11:16+05:30 IST