రాయపాటి కోడలు మమత విచారణకు బ్రేక్

ABN , First Publish Date - 2020-08-15T01:47:47+05:30 IST

విజయవాడ : నగరంలోని స్వర్ణ పాలెస్‌ కోవిడ్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం విదితమే.

రాయపాటి కోడలు మమత విచారణకు బ్రేక్

విజయవాడ : నగరంలోని స్వర్ణ పాలెస్‌ కోవిడ్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం విదితమే. ఈ ఘటనలో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డాక్టర్ కోడలు మమతకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయగా.. విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలో పోలీసుల ఎదుట ఆమె హాజరయ్యారు. 6 గంటల పాటు మమతను పోలీసులు విచారించారు. మమత నుంచి పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే మమత కరోనా నుంచి కోలుకుంటున్నారు. ఈ విషయం తెలియక పోలీసులు విచారించారు.


ఈ క్రమంలో.. మమతా విచారణకు బ్రేక్ పడింది. అనారోగ్య రీత్యా డాక్టర్ మమత విచారణకు బ్రేక్ ఇచ్చామని పోలీసులు చెబుతున్నారు. కరోనా చికిత్స తీసుకుంటున్నట్టు తెలియదని పోలీస్ శాఖ తెలిపింది. ఆరోగ్యం కోలుకున్నాక తిరిగి విచారణను కొనసాగిస్తామని సౌత్ ఏసీపీ సూర్య చంద్ర మీడియాకు వెల్లడించారు.


కాగా.. అంతకుముందు మీడియాతో మాట్లాడిన మమత.. కేవలం ఆరోపణలు మాత్రమే తనపై వచ్చాయని వెల్లడించారు. గుంటూరు రమేష్ హాస్పిటల్‌లో ఆపేరేషన్‌కు సంబంధించిన అంశాలు మాత్రమే తాను పరిశీలిస్తున్నట్లు డాక్టర్ మమత స్పష్టం చేశారు. విజయవాడ హాస్పిటల్‌కి తనకి ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కేవలం విజయవాడ పోలీసులు నోటీస్ ఇవ్వడం వల్ల మాత్రమే తాను విచారణకు హాజరయ్యానని మమత మీడియాకు వెల్లడించారు.

Updated Date - 2020-08-15T01:47:47+05:30 IST