జగన్‌కు బాకాలు ఊదే వ్యక్తి శ్రీకాంత్‌రెడ్డి: బోండా ఉమ

ABN , First Publish Date - 2020-06-06T18:47:52+05:30 IST

అమరావతి: మంత్రి గడికోట శ్రీకాంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నామని టీడీపీ నేత బోండా ఉమ పేర్కొన్నారు. ఒక కుప్పమే కాదు..

జగన్‌కు బాకాలు ఊదే వ్యక్తి శ్రీకాంత్‌రెడ్డి: బోండా ఉమ

అమరావతి: మంత్రి గడికోట శ్రీకాంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నామని టీడీపీ నేత బోండా ఉమ పేర్కొన్నారు. ఒక కుప్పమే కాదు.. సీఎం జగన్ రెడ్డి నివాసం ఉంటున్న తాడేపల్లిలో అయినా చర్చకు సిద్దమన్నారు. పాలన చేతగాక ఏడాది పాటు రాష్ట్రంలో విధ్వంసకాండ సృష్టించారని.. వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు. మంత్రి పదవి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డికి బాకాలు ఊదే వ్యక్తి గడికోట శ్రీకాంత్ రెడ్డి అని పేర్కొన్నారు. రూ.10 కోట్ల విలువైన ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టారన్నారు.


వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రాన్ని, అమరావతిని.. కుక్కలు చింపిన విస్తరిని చేశారని బోండా ఉమ పేర్కొన్నారు. ఒక్క రాజధానిని కట్టడం చేతగాని మీరు మూడు రాజధానులు కడతామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. విశాఖలో దోచుకున్న 30వేల ఎకరాల భూముల ధరలు పెంచుకోవడం కోసం.. రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. నిరుద్యోగ భృతిని రద్దు చేశారని.. పేద యువతలకు రూ.లక్ష పెళ్లి కానుకను దూరం చేశారని బోండా ఉమ విమర్శించారు.


Updated Date - 2020-06-06T18:47:52+05:30 IST