బోయిన్పల్లి పీఎస్ పరిధిలో దారుణం
ABN , First Publish Date - 2021-11-26T14:39:12+05:30 IST
బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వివాహిత తనతో మాట్లాడటం లేదని ఓ యువకుడు..
హైదరాబాద్: బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వివాహిత తనతో మాట్లాడటం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బోయినపల్లిలో నివాసముంటున్న దుర్గేష్ అనే ఎలక్ట్రీషియన్కు ఓ వివాహితతో రెండేళ్ల క్రితం పరిచయమైంది. అప్పటి నుంచి బాగానే ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా వివాహిత తనతో మాట్లాడటం మానేసిందని దుర్గేష్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.