ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసింది: సంజయ్

ABN , First Publish Date - 2021-06-26T01:21:01+05:30 IST

ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఖూనీ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి

ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసింది: సంజయ్

హైదరాబాద్: ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఖూనీ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. "భారత ప్రజాస్వామ్యంలో చీకటి కాలం" అనే అంశంపై బీజేపీ కార్యాలయంలో సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారని సంజయ్ ఆరోపించారు. శాంతిభూషణ్ అనే అడ్వకేట్ లేకపోతే ఇందిరాగాంధీ చేసిన తప్పిదాలు ప్రజలకు తెలిసేవి కావన్నారు. అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించి ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేశారని సంజయ్ విమర్శించారు. భవిష్యత్తు తరాలకు చరిత్రను అందించేలా కృషి చేయాలన్నారు.

 


ప్రశ్నిస్తే పత్రికలను అణిచివేస్తూ, జర్నలిస్టులను ప్రభుత్వం అరెస్ట్ చేయిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీని చదివి కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఆనాటి పోరాట చరిత్రను పుణికి పుచ్చుకొని ఉద్యమిస్తామని సంజయ్ తెలిపారు. ఎమర్జెన్సీకి సీపీఐ మద్దతు తెలిపిందని, ఇప్పుడు ఎమర్జెన్సీలో పాల్గొన్నాం అని చెప్పుకోవడం సిగ్గుచేటని బండి సంజయ్ విమర్శించారు. 

Updated Date - 2021-06-26T01:21:01+05:30 IST