పశ్చిమగోదావరి జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం
ABN , First Publish Date - 2021-05-17T23:24:14+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం రేగింది. ఎల్ఎన్పురానికి చెందిన సూర్యనారాయణకి బ్లాక్ ఫంగస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం రేగింది. ఎల్ఎన్పురానికి చెందిన సూర్యనారాయణకి బ్లాక్ ఫంగస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇటీవలే కరోనాతో సూర్యనారాయణ చికిత్స పొందారు. బ్లాక్ ఫంగస్గా విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ వైద్యులు నిర్ధారించారు. అయినా బాధితుడిని స్థానిక వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పట్టించుకోలేదు. సొంతంగానే సత్యనారాయణ ఇంట్లో చికిత్స పొందుతున్నాడు.
రాష్ట్రంలో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య కూడా నెమ్మదిగా పెరుగుతున్నాయి. కొవిడ్ బాధితుల్లో ఎక్కువగా బ్లాక్ ఫంగస్ బయటపడుతోంది. ఎక్కువగా ఐసీయూలో ఉండడం, ఆక్సిజన్, స్టెరాయిడ్స్ వాడే వారిలో ఎక్కువగా బ్లాక్ ఫంగస్ బయటపడుతోందని వైద్యులు చెబుతున్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లాలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. తర్వాత గుంటూరులో 4, తూర్పుగోదావరి 3, ప్రకాశం 1, కర్నూలులో 2 కేసులు నమోదయ్యాయి. విశాఖ, పశ్చిమగోదావరిలోనూ లక్షణాలున్నవారిని గుర్తిచారు.