ఇది కలియుగ వింత: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-01-16T20:30:45+05:30 IST

బీజేపీ రాష్ట్రానికి పట్టిన శని గ్రహం...వైసీపీ రాష్ట్రానికి పట్టిన రాహు అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి ఆరోపించారు.

ఇది కలియుగ వింత: తులసిరెడ్డి

 కడప: బీజేపీ, వైసీపీలపై ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, వైసీపీలు హస్తినలో దోస్తీ.. రాష్ట్రంలో కుస్తీ పడతాయని విమర్శించారు. బీజేపీ రాష్ట్రానికి పట్టిన శని గ్రహంకాగా, వైసీపీ రాష్ట్రానికి పట్టిన రాహు అని ఎద్దేవా చేశారు. అభివృద్ధి చేయడం చేతకాక మత రాజకీయాలతో ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ద్వంద్వ వైఖరీతో పోలీసు వ్యవస్థ పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోతారన్నారు. కోడిపందాలకు అడ్డు రాని కరోనా పంచాయతీ ఎన్నికలకు అడ్డు రావడం కలియుగ వింత అని తులసిరెడ్డి విమర్శించారు.

Updated Date - 2021-01-16T20:30:45+05:30 IST