కేసీఆర్ పీఠం కదులుతుంది: పొంగులేటి

ABN , First Publish Date - 2021-11-14T00:02:28+05:30 IST

హుజురాబాద్ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ పీఠం కదులుతోందని బీజేపీ

కేసీఆర్ పీఠం కదులుతుంది: పొంగులేటి

ఖమ్మం: హుజురాబాద్ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ పీఠం కదులుతోందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. బీజేపీ పార్టీ ఎదుగుదలను ఓర్వలేక కేసీఆర్ తన ప్రతాపాన్ని రైతుల పై చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. చివరి గింజ వరకు కొంటామని అని చెప్పి ఇప్పుడు వరి వెయ్యొద్దు అంటున్నారన్నారు. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేయాలన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పలేదన్నారు. మంత్రి పువ్వాడ తన నోరును అదుపులో పెట్టుకోవాలన్నారు. 

Updated Date - 2021-11-14T00:02:28+05:30 IST