అగ్నిపథ్ అనేది ఒక సాకు మాత్రమే..: Somuveerraju

ABN , First Publish Date - 2022-06-18T16:28:50+05:30 IST

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(Somuveerraju) స్పందించారు.

అగ్నిపథ్ అనేది ఒక సాకు మాత్రమే..: Somuveerraju

అమరావతి: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somuveerraju) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ధ్వంస రచన ఒక పధకం ప్రకారం జరిగిందనేది స్పష్టంగా కనపడుతోందన్నారు. అగ్నిపథ్ అనేది ఒక సాకు మాత్రమే అని...  విధ్వంసం వారి లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. విదేశీ శక్తులు ఇక్కడ ఉన్న కొన్ని వర్గాలు కలిపి చేస్తున్న విధ్వంసంగా భావించాల్సి వస్తుందన్నారు. మీడియా ద్వారా వస్తున్న ఆడియో పరిశీలిస్తే ఒక గంటలో మొత్తం ధ్వంసం చేయాలని ఆడియో ఆదేశాలు వచ్చాయి అంటేనే అర్థం అవుతోందని అన్నారు. రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర రైల్వే స్టేషన్‌లలో భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. రైల్వే ప్రయాణికులకు పూర్తి రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలని సోమువీర్రాజు అన్నారు. 



Updated Date - 2022-06-18T16:28:50+05:30 IST