అల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదంపై Somuveerraju దిగ్భ్రాంతి
ABN , First Publish Date - 2022-06-13T18:03:24+05:30 IST
అల్లూరి జిల్లాల్లో ఘోర బస్సు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమరావతి: అల్లూరి జిల్లాల్లో ఘోర బస్సు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు(Somuveerraju) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఐదుగురు మృతి బాధాకరమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో సంబంధిత అధికారులు విఫలం అవుతున్నారని బీజేపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. దుర్మరణం పాలైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. జరిగిన సంఘటనపై దర్యాప్తు జరిపి ఘటనకు గల కారణాలను వెంటనే అధికార యంత్రాంగం వెల్లడించాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు.