TS News: భాగ్యనగరం వరదల్లో మునగటానికి కేసీఆర్, కేటీఆరే కారణం: ఎన్వీఎస్ఎస్
ABN , First Publish Date - 2022-07-28T20:03:02+05:30 IST
భాగ్యనగరం వరదల్లో మునగటానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లే కారణమని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు.
హైదరాబాద్: భాగ్యనగరం వరదల్లో మునగటానికి సీఎం కేసీఆర్(KCR), మంత్రి కేటీఆర్(KTR)లే కారణమని బీజేపీ (BJP) సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... కోర్టు మెట్టికాయలు వేసినా ముందస్తు చర్యలు లేవని మండిపడ్డారు. మున్సిపల్ మంత్రికి విజన్ లేకపోవడం వల్లే వరదలు హైదరాబాద్ కొంప ముంచుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. మిషన్ కాకతీయ ఏమైందని ప్రశ్నించారు. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్, సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చెరిగిపోయిందన్నారు. రాష్ట్రపతిపై కాంగ్రెస్ నేత అధిర్ చౌదరి భాషను ఖండిస్తున్నామని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.