బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థులకు కొదవలేదు: Ramesh

ABN , First Publish Date - 2022-06-06T14:52:19+05:30 IST

బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థులకు కొదవలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు.

బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థులకు కొదవలేదు: Ramesh

అమరావతి: బీజేపీ(BJP)లో ముఖ్యమంత్రి అభ్యర్థులకు కొదవలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు (Nagotu Ramesh Naidu) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు బీజేపీకి నియమావళి ఉందని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటనలో సంస్థాగత విషయాలపై దిశా నిర్దేశం చేస్తారన్నారు. రేపు రాజమండ్రి సభలో నడ్డా బీజేపీ ఎనిమిదేళ్లలో సాధించిన విజయాలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడతారని చెప్పారు. అవకాశం వచ్చినప్పుడు తమ ప్రతిభ ఏమిటో చూపిస్తారన్నారు. బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు లేరని చేస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. డిమాండ్లు, అల్టిమేట్‌లకు బీజేపీ కార్యకర్తలు ఎవరు భయపడరని రమేష్ నాయుడు స్పష్టం చేశారు. 

Updated Date - 2022-06-06T14:52:19+05:30 IST