Kanna laxmi Narayana: అమరావతి రాజధానిపై కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-08-05T01:24:03+05:30 IST

అమరావతిని (Amaravathi) కాదని మరో రాజధాని సాధ్యం కాదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ( Bjp Leader Kanna Laxmi Narayana) అన్నారు. ...

Kanna laxmi Narayana: అమరావతి రాజధానిపై కీలక వ్యాఖ్యలు

అమరావతి: అమరావతిని (Amaravathi) కాదని మరో రాజధాని సాధ్యం కాదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ( Bjp Leader Kanna Laxmi Narayana) అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా తుళ్లూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణతో పాటు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.  సభలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్టీలను నమ్మి రైతులు భూములు త్యాగం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి కేంద్రం వేల కోట్లు ఇచ్చిందని చెప్పారు. సీఎం మారినప్పుడల్లా రాజధాని మారడం అభివృద్ధికి చేటని తెలియని సీఎం ఉండటం దురదృష్టకరమని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. 


మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ (Ex Minsiter Kamineni Srinivas)  మాట్లాడుతూ మూడు రాజధానులను వైసీపీ (Ycp) వారూ వ్యతిరేకిస్తున్నారన్నారు. కేవలం స్టేజ్‌పైనే అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడతున్నారని చెప్పారు. విశాఖలో రుషికొండను నాశనం చేశారని.. రాజధాని ఎందుకు మార్చాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని కామినేని శ్రీనివాస్ అన్నారు. 



Updated Date - 2022-08-05T01:24:03+05:30 IST