కేసీఆర్ను తెలంగాణ అసహ్యించుకుంటోంది: ఈటల
ABN , First Publish Date - 2021-10-29T23:57:43+05:30 IST
హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును యావత్తు తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని బీజేపీ నాయకుడు, ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఎక్కడ తెలుగుతల్లి, ఎవరికి తెలుగుతల్లి అన్న కేసీఆర్.. ప్లీనరీలో తెలుగుతల్లి విగ్రహాన్ని పెట్టి తన అంతరంగాన్ని ఆవిష్కరించుకున్నాడని ఆయన విమర్శించారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల డబ్బుతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దౌర్జన్యం చేస్తున్నారని ఈటల ఆరోపించారు.