ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో కేసీఆర్ చర్చించాలి: డీకే అరుణ
ABN , First Publish Date - 2021-11-09T01:28:02+05:30 IST
ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో సీఎం కేసీఆర్ చర్చించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
హైదరాబాద్: ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో సీఎం కేసీఆర్ చర్చించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ధర్నాలు చేసే హక్కు టీఆర్ఎస్కి లేదన్నారు. సీఆర్ ఫాంహౌస్ విస్తీర్ణం ఎన్ని ఎకరాల్లో ఉందన్నారు. జన్వాడ ఫాంహౌస్ సంగతేంటని ప్రశ్నించారు. కేసీఆర్ కూతురు దుబాయ్లో 60 కోట్లతో ఫ్లాట్ కొన్నమాట వాస్తవం కాదా అని నిలదీసారు. దళితబంధు అమలు చేసేవరకు కేసీఆర్ను వదిలిపెట్టమని అరుణ పేర్కొన్నారు.