బీజేపీ నేత చిలకం రామచంద్రారెడ్డి మృతి

ABN , First Publish Date - 2021-07-04T07:35:32+05:30 IST

బీజేపీ నేత చిలకం రామచంద్రారెడ్డి మృతి

బీజేపీ నేత చిలకం రామచంద్రారెడ్డి మృతి

కిషన్‌ రెడ్డి, వీర్రాజు, సంజయ్‌ సంతాపం 


హైదరాబాద్‌/విజయపురం, జూలై 3(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి(85) అనారోగ్యంతో మరణించారు. చెన్నైలోని కింగ్‌ హాస్పిటల్‌లో కొవిడ్‌తో పోరాడుతూ శనివారం ఆయన  తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా విజయపురం మండలం మంగళంలో 1937 సెప్టెంబరు 24న రామచంద్రారెడ్డి జన్మించారు. ఆయనకు కుమారుడు చిలకం ఈశ్వర్‌ప్రసాద్‌, కుమార్తెలు దాక్షాయణి, మాధవి ఉన్నారు. రామచంద్రారెడ్డి మృతి పట్ల బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, పురందేశ్వరి, ఎమ్మెల్యే రోజా తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, ఎన్‌. ఇంద్రసేనారెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-07-04T07:35:32+05:30 IST