Jubilee hills మైనర్ రేప్ కేసు... పోలీసులపై మండిపడ్డ Tarun Chugh
ABN , First Publish Date - 2022-06-09T19:38:29+05:30 IST
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసులో పోలీసులు అవకతవకలు పాల్పడ్డారని బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసులో పోలీసులు అవకతవకలు పాల్పడ్డారని బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ (Tarun Chugh)ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రేప్ జరిగిన వాహనం ప్రభుత్వ వాహనమని గుర్తించడానికి ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు. దోషులును రక్షించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయతిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఎలా చెప్పితే అలా వ్యవహరించే పోలీసులు ఉన్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం కోసం మాత్రమే పని చేసే కొంతమంది పోలీసులు ఉన్నారని తెలిపారు. కుటుంబం కోసం మానేసి ప్రజల కోసం ఆ పోలీసులు పని చేయాలని హితవుపలికారు. జూబ్లీహిల్స్ కేసులో న్యాయం జరిగే వరకు బాధితురాలి పక్షాన బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.