ఉండవల్లికి బీజేపీ కౌంటర్
ABN , First Publish Date - 2022-06-14T18:18:18+05:30 IST
ఉండవల్లికి బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్రెడ్డి ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
అమరావతి: ప్రధాని మోదీని ఎదుర్కొనే శక్తి సీఎం కేసీఆర్కి ఉందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ బలంగా ఉండబోదని ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్రెడ్డి ట్విటర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ఉండవల్లి గారు.. రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెబుతూనే రాజకీయాల గురించి మాట్లాడతారు, నేతలను కలుస్తారు, ప్రశ్నిస్తే అబ్బెబ్బే అదేం లేదండి ఉత్తినే పిలిస్తే వెళ్లానంటారు .ఊసరవెల్లి రాజకీయాలు మానేసి మీ దృష్టిని బీజేపీ మీద నుంచి మీకు రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ను పైకి లేపడం మీద పెట్టండి’’ అని విష్ణువర్ధన్రెడ్డి ట్వీట్ చేశారు.