బిట్ కాయిన్ కేసు నిందితుడు అరెస్ట్, రిమాండ్కు తరలింపు
ABN , First Publish Date - 2020-10-02T02:27:30+05:30 IST
ఆన్లైన్ బిట్ కాయిన్ కేసులో నిందితుడు నాగరాజును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్కు ..
హైదరాబాద్: ఆన్లైన్ బిట్ కాయిన్ కేసులో నిందితుడు నాగరాజును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్కు తరలించారు. ఆన్లైన్ బిట్ కాయిన్ పేరుతో 1200 మంది నుంచి నాగరాజు రూ.50కోట్లు వసూలు చేశాడు. పెట్టుబడి పెడితే 18 వారాల్లో అధిక లాభాలతో చెల్లింపులు చేస్తానని మోసాలకు పాల్పడ్డాడు. మరికొంత మంది నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.