దళిత కాంట్రాక్టర్లకు నాలుగేళ్లుగా బిల్లులేవ్‌

ABN , First Publish Date - 2022-05-15T08:40:42+05:30 IST

కోటి రూపాయల్లోపు కాంట్రాక్టు పనుల్లో ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు రిజర్వేషన్‌ కల్పిస్తున్న ప్రభుత్వం.

దళిత కాంట్రాక్టర్లకు నాలుగేళ్లుగా బిల్లులేవ్‌

దళిత పరిశ్రమల సమాఖ్య చైర్మన్‌ రాజశేఖర్‌

హైదరాబాద్‌, మే 14(ఆంధ్రజ్యోతి): కోటి రూపాయల్లోపు కాంట్రాక్టు పనుల్లో ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు రిజర్వేషన్‌ కల్పిస్తున్న ప్రభుత్వం.. బిల్లులు చెల్లించడంలో మాత్రం నిర్లక్షం వహిస్తోందని భారత దళిత పరిశ్రమల సమాఖ్య (సీఐడీఐ) చైర్మన్‌ రాజశేఖర్‌ ఎర్రతోట ఆరోపించారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో దళిత కాంట్రాక్టర్లు చేపట్టిన పనులకు సంబంధించిన ఒక్క బిల్లును కూడా ప్రభుత్వం ఆమోదించలేదన్నారు. నగరంలోని సమాఖ్య కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. దళితబంధు పథకంతో పాటు వైన్‌, ఫర్టిలైజర్స్‌, మెడికల్‌ షాప్స్‌లో దళితులకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. అనంతరం దళిత పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు.  


Updated Date - 2022-05-15T08:40:42+05:30 IST