Bhupalapalli Districtలో కలకలం రేపుతున్న పులి సంచారం
ABN , First Publish Date - 2022-05-19T17:51:17+05:30 IST
భూపాలపల్లి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. కమలాపూర్ అటవీప్రాంతంలో పులిసంచారం చేస్తున్నట్లు గ్రామ ప్రజలు
జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. కమలాపూర్ అటవీప్రాంతంలో పులిసంచారం చేస్తున్నట్లు గ్రామ ప్రజలు పులి పాదముద్రలను గుర్తించారు. ఈ విషయాన్ని గ్రామ ప్రజలు అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఆజంనగర్ రేంజి పోలారం వైపు పులి వెళ్లినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో కమలాపురం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.