ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది: భట్టి

ABN , First Publish Date - 2021-03-18T20:33:20+05:30 IST

ప్రభుత్వం బడ్జెట్ అంకెల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది: భట్టి

హైదరాబాద్:  2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. గురువారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో బడ్జెట్‌‌ అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వం బడ్జెట్ అంకెల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతూనే 2,30,825.96 కోట్ల బడ్జెట్ ఎలా ప్రవేశపెడతారని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భట్టి విక్రమార్క  నిలదీశారు.


ఇప్పటికే మూడున్నర లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పారు.ఈ ఏడాది ఆర్థికలోటు 45,509 కోట్లు చూపించారని దుయ్యబట్టారు. అప్పుల భారాన్ని భారీగా పెంచుతున్నారని ధ్వజమెత్తారు.సామాన్యులకు మేలు చేయట్లేదని చెప్పారు. గతసారి లక్షా 43 వేల కోట్లు బడ్జెట్  చేరలేదని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మూడెకరాల భూమి, ఉద్యోగాలు లేవని చెప్పారు.ప్రజలను మోసం చేసేవిధంగా బడ్జెట్ ఉందని భట్టి విక్రమార్క మండిపడ్డారు.

Updated Date - 2021-03-18T20:33:20+05:30 IST