అంచనా వేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు: భట్టి

ABN , First Publish Date - 2022-07-18T01:41:14+05:30 IST

వరదలపై తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు.

అంచనా వేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు: భట్టి

హైదరాబాద్: వరదలపై తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు, ప్రజలు నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంటనష్టం అంచనా వేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదన్నారు. గూడు కోల్పోయినవారికి ఇల్లు కట్టివ్వాలని సూచించారు. వెంటనే రుణమాఫీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోడు రైతులకు భరోసా కల్పిస్తామన్నారు. ప్రాజెక్టుల్లో అవకతవకలు, అవినీతిపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-18T01:41:14+05:30 IST