దొడ్ల డెయిరీలో భారత్‌ బయోటెక్‌కు వాటా

ABN , First Publish Date - 2022-09-22T06:35:35+05:30 IST

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ, స్థానిక దొడ్ల డెయిరీ కంపెనీ ఈక్విటీలో కొద్ది పాటి వాటా కొనుగోలు చేసింది.

దొడ్ల డెయిరీలో భారత్‌ బయోటెక్‌కు వాటా

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ, స్థానిక దొడ్ల డెయిరీ కంపెనీ ఈక్విటీలో కొద్ది పాటి వాటా కొనుగోలు చేసింది. ఒక్కో షేరును రూ.525 చొప్పున టీపీజీ దొడ్ల్ల డెయిరీ హోల్డింగ్స్‌ నుంచి 18,31,434  షేర్లను (3.07 శాతం), కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన సునీల్‌ రెడ్డి దొడ్ల నుంచి 1.95 లక్షల షేర్లను (0.32 శాతం) భారత్‌ బయోటెక్‌  కొనుగోలు చేసినట్టు ఎన్‌ఎస్‌ఈ బ్లాక్‌డీల్స్‌ డేటా ఆధారంగా తెలుస్తోంది. ఇందుకోసం మొత్తం రూ.106.38 కోట్లు చెల్లించింది.  

Updated Date - 2022-09-22T06:35:35+05:30 IST