భాన్జు ప్లాట్ఫామ్కు రూ.115 కోట్ల నిధులు
ABN , First Publish Date - 2022-09-23T07:02:52+05:30 IST
హైదరాబాద్కు చెందిన అంతర్జాతీయ మ్యాథ్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ భాన్జ్జుకు 1.5 కోట్ల డాలర్ల (దాదాపు రూ.115 కోట్లు) నిధులు
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన అంతర్జాతీయ మ్యాథ్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ భాన్జు (Bhanzu) 1.5 కోట్ల డాలర్ల (దాదాపు రూ.120 కోట్లు) నిధులు లభించాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ క్యాలిక్యులేటర్గా పేరు పొందిన నీలకంఠ భాను ఈ ప్లాట్ఫామ్ను స్థాపించారు. అంతర్జాతీయ గ్లోబల్ ఇన్వెస్టర్లు ఎయిట్ రోడ్స్ వెంచర్స్ ఆధ్వర్యంలో మదుపర్లు సిరీస్-ఏ నిధుల కింద ఈ మొత్తాన్ని సమకూర్చారు.
మరో అంతర్జాతీయ ఇన్వెస్టర్ సంస్థ బీ క్యాపిటల్ కూడా పెట్టుబడులు పెట్టింది. టెక్ మౌలిక సదుపాయాలను, మ్యాథ్స్ కరిక్యులమ్లను బలోపేతం చేసుకోవడానికి భాన్జు ఈ నిధులను వినియోగిస్తుందని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ నీలకంఠ భాను తెలిపారు. లెక్కలంటే భయం లేకుండా ఆనందంతో నేర్చుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి వీలుగా కరిక్యులమ్ను తీర్చిదిద్దినట్లు చెప్పారు.