అక్కడి పరిస్థితి చూసి నా గుండె పగిలింది: అమెజాన్ అధినేత బెజోస్

ABN , First Publish Date - 2021-12-12T20:57:22+05:30 IST

సుడిగాలులు(టోర్నాడోలు) సృష్టించిన బీభత్సంతో అమెరికాలో కల్లోలం రేగింది. ఆరు రాష్ట్రంలో టోర్నాడోలు, భారీ వర్షాలు సృష్టించిన విలయానికి అనేక మంది బలయ్యారు. కాగా.. ఇలినాయ్‌ రాష్ట్రంలోని అమెజాన్ సంస్థ చెందిన గోదాము కూడా సుడిగాలుల ధాటికి కుప్పకూలింది.

అక్కడి పరిస్థితి చూసి నా గుండె పగిలింది: అమెజాన్ అధినేత బెజోస్

వాషింగ్టన్: సుడిగాలులు(టోర్నాడోలు) సృష్టించిన బీభత్సంతో అమెరికాలో కల్లోలం రేగింది. ఆరు రాష్ట్రంలో టోర్నాడోలు, భారీ వర్షాలు సృష్టించిన విలయానికి అనేక మంది బలయ్యారు. కాగా.. ఇలినాయ్‌ రాష్ట్రంలోని అమెజాన్ సంస్థ చెందిన గోదాము కూడా సుడిగాలుల ధాటికి కుప్పకూలింది. ఈ క్రమంలో ఆ గోడౌన్‌లోని ఆరుగురు వర్కర్లు మరణించారు. ఈ ఘటనపై అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తాజాగా స్పందించారు. అక్కడి పరిస్థితి చూసి తన గుండె పగిలిందని ఆయన వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు స్వాంతన చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. కాగా.. స్థానిక అధికారుల సహాయంతో అమెజాన్ బాధితుల కుటుంబాలకు సహాయం చేస్తున్నట్టు సంస్థ సీఈఓ ఆండీ జస్సీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-12T20:57:22+05:30 IST